నెల్లూరు పట్టణ 1 వ డివిజన్ యువత చేరిక జనసేన పార్టీలోకి చేరిక

                నెల్లూరు రూరల్ ఇంచార్జ్ మనుక్రాంత్ గారి తరపున నెల్లూరు సిటీ నుండి 1వ డివిజన్ నుండి జనసేన నాయకులు గునుకుషోర్, సుజయ్బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ లో చేరిన సాయిరెడ్డి యువత… జనసేన నాయకులు మాట్లాడుతూ డబ్బు ఖర్చు పెట్టకుండా ఒత్తిడులకు గురి చేయకుండా ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా జనసేన పార్టీ స్వచ్ఛందంగా బలపడుతుంది అన్నారు. స్థానిక ఎన్నికలలో జనసేన బలపరిచిన అభ్యర్థులు 27 శాతం పోలింగ్ నమోదు చేయడమే దీనికి నిదర్శనమన్నారు.  ఒకటవ డివిజన్ నుంచి స్వచ్ఛందంగా మేము జనసేన పార్టీ తరఫున పని చేస్తాం జనసేన తరపున జరిగే కార్యక్రమాల్లో పార్టీ బలోపేతం చేసే దిశగా ప్రయాణిస్తాము రావడం ఆనందంగా ఉందన్నారు. పోటీ చేసే వ్యక్తిని జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తాం అంటూ ముందుకు వచ్చిన సాయి రెడ్డి మరియు మిత్రులకు అభినందనలు తెలియజేసారు.ఇదే విధంగా ప్రతి డివిజన్ నుంచి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జరగబోయే జనసేన పార్టీ మద్దతుదారులు కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వచ్ఛందంగా పార్టీని బలోపేతం చేయాలని కిషోర్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాసు స్టికర్స్ ను సుజయ్ బాబు చేతులమీదుగా ప్రారంభించి నగరం లో జనసేన మద్దతు దారుల బైక్ లపై అతికించి గాజు గ్లాసు గుర్తును ప్రజలలోకి తీసుకువెళ్తాం అని తెలిపారు.

See also  రాప్తాడులో జర్నలిస్టులపై వైసిపి నాయకులు దాడి చేయడం దారుణం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి