నెల్లూరు జనసేన పార్టీ ఆధ్వర్యలో వంగవీటి మోహన రంగా వర్ధంతి నివాళులు

నెల్లూరు

          నెల్లూరు ( జనస్వరం ) : స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి వర్ధంతిని ఘనంగా నెల్లూరు సుబేదార్ పేట వద్ద గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవడి దయా దాక్షిణ్యాల కింద బతకాల్సిన అవసరం లేదు. మనం ఎవరికీ పుట్టలేదు ఎవడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నాము అన్నారు. ధైర్యంగా బ్రతకండి అని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి భూత భవిష్యత్ వర్తమాన కాలానికి తిరుగులేని ఆదర్శ నాయకుడుగా ఎదిగిన వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నామన్నారు. అధికార మదంతో విర్రవీగుతున్న కొన్ని కుటుంబాలకు సమాధానం చెప్పగలిగిన మొనగాడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే జోహర్ శ్రీ వంగవీటి మోహన రంగా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాయకులు గాదిరాజు అశోక్, కెఆర్పిఆర్ ఓ పసుపర్తి కిషోర్ భవిశెట్టి కిషోర్, గునుకుల కిషోర్, భక్తవత్సలం, సుధామాధవ్, వంశీ, రఘ, శివ, పవన్ తదితరులు పాల్గొన్నారు

See also  జనసేన సిద్ధాంతంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులు పంపిణీ