నెల్లూరు : జనసేన బుచ్చి మండల కార్యాలయం ప్రారంభం

నెల్లూరు

           నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ గారి చేతుల మీదగా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండల ఇన్చార్జి మాధవ్ మరియు పసుపులేటి  సురేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే ధ్యేయంగా జనసైనికులు ముందుకు సాగాలని వైసిపితో విసిగి పోయిన ప్రజలకు అండగా అన్ని మండలాల ముఖ్య నాయకులు నిలిచి, జనసేన మద్దతుదారులు సమీకృతం చేసుకుంటూ జనసేన పార్టీని బలోపేతం స్వచ్చందంగా ముందుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గారితో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి సుజయబాబు, కోవూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు చప్పిడి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

See also  ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట పాదయాత్ర