
నర్సీపట్నం నియోజకవర్గ౦ కొంగ సింగి గ్రామంలో సమస్యలపై జనసేన నాయకుల ఆరా!!
నర్సీపట్నం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త గొలుగొండ మండలం కొంగ సింగి గ్రామంలో పర్యటించి పలు సమస్యలపై ఆరా తీశారు. గ్రామాల్లో ఉన్నటువంటి పలు సమస్యలపై ప్రత్యక్షంగా పర్యవేక్షించి జనసైనికుల ద్వారా ఆయా గ్రామాలలో ఎవరికైతే సంక్షేమ పథకాలు అందటం లేదు మరియు ఆయా గ్రామాలలో అభివృద్ధి పనులు ఏమి చేస్తున్నారో ఇటువంటి విషయాలపై గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం వద్దకు వెళ్లి సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యే దిశగా జనసైనికులు కృషిచేయాలని అని అన్నారు. ఒకవేళ సచివాలయ పరిధిలో సమస్య పరిష్కారం కాకపోతే మండలంలో ఉన్నటువంటి ఎంపీడీవో ఆఫీస్ మరియు ఎమ్మార్వో ఆఫీస్ వద్దకు మన జనసైనికులు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లవలసిందిగా కోరుతున్నాను అని అన్నారు. క్లిష్టమైన సమస్యలు అయితే నర్సీపట్నంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారి దృష్టికి మరియు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యే దిశగా ప్రయాణం చేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొంగ సింగి జనసైనికులు మాట్లాడుతూ మన గ్రామం లో ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టుల భర్తీలో మా ఊర్లో నివసిస్తున్న అటువంటి ఏ ఆసరా లేని వ్యక్తికి కాకుండా వేరే ఊరు వారిని ఎంపిక చేసేందుకు స్థానిక నాయకులు అధికారులు ఆ ఉద్యోగం కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రయత్నం వెంటనే విరమించుకోవాలని మా గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడే నివసిస్తున్న అటువంటి మహిళలను ఎంపిక చేయాల్సిందిగా ఆర్డీవో గారి దృష్టికి తీసుకువెళ్లి అన్ని అర్హతలూ ఉన్న మావూరి మహిళను ఎంపిక చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు ఊడి చక్రవర్తి, గొలుగొండ మండలం నాయకులు గండెందొరబాబు, సఖి రెడ్డి మణి బాబు, చెల్లూరి గుణశేఖర్, పవన్ మూర్తి, కొట్టే సాయి కుమార్, నిమ్మకాయల ప్రసాద్, సాయి గణేష్, ఎలమంచిలి శివ, మ౦సాల నానాజీ తదితరులు పాల్గొన్నారు.








