అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రశ్నించిన మైలవరం జనసేన ఇంఛార్జ్ అక్కల రామమోహన్ రావు

మైలవరం

           దొంగలు దోపిడీ లాగా మట్టి దోపిడీ అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిది అక్కల రామ మోహన రావు అన్నారు. గణపవరం, వెల్లడం, వెల్లటూరు మైలవరం నియోజకవర్గంలో అనేక గ్రామల చెరువులలో అర్ధ రాత్రి మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతున్నా  స్థానిక రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు పటించుకోవడంలో  వారి నిర్లక్ష్యం కనపడుతుంది. వైసీపీ నాయకులు వందలాది ట్రాక్టర్ లతో మట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. mla వసంత కృష్ణ ప్రసాద్ గారు దీని పై ప్రజలుకు సమాధానం చెప్పాలి అని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము. మట్టి గ్రావెల్ అక్రమ తవ్వకాలు నిలుపుదల చెయ్యక  పోతే వారి మీద MRO గారు  తగిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ గారికి దీని పైన ఫిర్యాదు చేస్తాము  అని జనసేన పార్టి తరుపున డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు.

See also  గూడు చెదిరిన అవ్వకు జనసైనికులు చేదోడు