చంద్రగిరిలో నా సేన కోసం నా వంతు కార్యక్రమం

చంద్రగిరి

          చంద్రగిరి ( జనస్వరం ) : జిల్లా అధ్యక్షులు dr పసుపులేటి హరిప్రసాద్ గారి ఆదేశాలమేరకు, జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ సూచనలతో చంద్రగిరి మండలంలో స్థానిక మండలనాయకుల ఆహ్వానం మేరకు యువరాజ్ అద్వర్యం లో నాసేన కోసం – నా వంతు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతిఒక్క జనసైనికులు, నాయకులు, మెగాఅభిమానులు, జనసేన సానుభూతిపరులు, జనసేన మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్క సైనికుడు జనసేనపార్టీ నాసేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగస్వాములై తమవంతు ఆర్థికసహాయం చెయ్యాలని పార్టీని ఆర్థికంగా బలపరచాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, మంజుల వాణి, ఆశ, కుసుమ, ఐతేపల్లి సాయి, రాకేష్, లోకేష్, నాగదిలీప్, బాషా, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు. 

See also  వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు బిల్లులు రాక తాళిబొట్లు కుదువ పెట్టే పరిస్థితి