సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం

సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం

సత్తెనపల్లి,జూలై15 ( జనస్వరం).

మండలంలోని లక్కరాజుగార్లపాడు గ్రామంలో సాయికృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో సింగరాజు చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించందని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్సిం గరాజు సాయికృష్ణ తెలిపారు.ఈ శిబిరంలో సాయికృష్ణ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు, నెమ్ము,దగ్గు, ఆయాసం, ఉబ్బసం వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి హాజరైన రోగులకు అవగాహన కల్పించారు.ఈ శిబిరంలో బీపీ, షుగర్, జ్వరాలు నెమ్ము, ఆయాసం, ఉబ్బసం, జలుబు, దగ్గు, థైరాయిడ్ సమస్యలు, మరియు అన్ని జనరల్ వ్యాధుల కు ఊపిరితిత్తుల వ్యాధులకు ఉచితంగా (ఈసీజీ,Random షుగర్, థైరాయిడ్ ప్రొఫైల్, Hb1Ac)పరీక్షలు చేసి సుమారు 160 మందికి వైద్య సేవలు అందజేశారు.అలాగే అవసరమైన రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ వైద్య శిబిరం లో గ్రామపెద్దలు పుట్టి హనుమంతరావు, బాలరాజు, సతీష్, కే హనుమంత రావు మరియు లక్కరాజుగార్లపాడు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

See also  చరిత్ర క్షమించని రీతిలో వైసీపీ రాక్షస పాలన