అనారోగ్యంతో చనిపోయిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మడకశిర జనసైనికులు

      మడకశిర, (జనస్వరం) : అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం రోళ్ల మండలం రత్నగిరి పంచాయతీలో రవి అనే జనసైనికుడు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కర్ణాటకలోని తుముకూరు జిల్లా ఆస్పత్రిలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసైనికులు కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా మేమున్నామంటూ మడకశిర నియోజకవర్గం జనసైనికులు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి 10,000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడైనా జనసైనికులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా జనసేనపార్టీ తరుపున  మేముంటామని భరోసా ఇవ్వడం జరిగింది.

See also  ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యార్థినికి భీమవరం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ చినబాబు గారి చేతుల మీదుగా రూ. 20,000 ఆర్థిక సహాయం