పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం – జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్

    విజయవాడ, (జనస్వరం) : విద్యాధరపురం బైపాస్ రోడ్డు, ఆర్టీసీ బస్ డిపో ఎదురుగా ఉన్న ఎం కన్వెన్షన్ హాల్లో 38, 39, 40, 41, 42, 43, 44., 45 డివిజన్ కమిటీలు ఏర్పాటు కోసం బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ హాజరై డివిజన్ నాయకులు ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్రతిఒక్కరు కృషి చేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆకుల కిరణ్, అజయ్ ఠాకూర్ వర్మ ,ఆర్. హరీష్, కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థులు షేక్ గాయాసుద్దిన్, బొమ్మ గోవింద లక్ష్మి, మల్లెపూలు విజయలక్ష్మి, కూరాకుల సురేష్, నగర కమిటీ సభ్యులు సోమనాథం, షేక్ మోబినా, లింగం శివ ప్రసాద్, శనివారపు శివ, కోరగంజి వెంకటరమణ, గన్ను శంకర్, తిరునగరి మురళీకృష్ణ, అమ్మ వారి ధార్మిక సేవ మండలి సభ్యులు, ముఖ్య నాయకులు, మైలవరపు కొండలరావు, స్టాలిన్, కార్యకర్తలు, డివిజన్లకు నాయకులు పాల్గొన్నారు.

See also  జనసేన నాయకులపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్