అంబేద్కర్ జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణి చేసిన కొత్తపల్లి జనసైనికులు

    కొత్తపల్లి, (జనస్వరం) : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించారు. అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఆయన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. అలానే జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తు శ్రీమతి డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తితో కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన శ్రీ దశంజనేయ స్వామి వారి చలివేంద్రం నందు ఎండలు తీవ్రత అంతకంతకు పెరుగుతుందడంతో ప్రతి మంగళవారం మజ్జిగ పంపిణితో పాటు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామస్థులు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  అంధకారంలో ఇంద్ర నగర్ ? విద్యుత్ అధికారులు సమస్యను పరిష్కరించాలని రాహుల్ సాగర్ డిమాండ్