
కొల్లిపాడు వాటర్ ట్యాంక్ శుభ్రపరచండి : జనసేన కణితి కిరణ్
సోమవారం స్పందన కార్యక్రమంలో టెక్కలి జనసేన ఇంచార్జి కణితి కిరణ్ కలెక్టర్ కార్యాలయానికి మెయిల్ ద్వారా సమస్యను వివరించారు. సంతబొమ్మలి మండలం కొల్లిపాడు గ్రామంలో సుమారు రెండు వేలమంది నివసిస్తున్నారు. ఈ గ్రామం లోని వాటర్ ట్యాంక్ సుమారుగా గత 4 సంవత్సరాలుగా శుభ్రపరచ లేదు. గత తిట్లీ తుఫాన్ లో ఈ వాటర్ ట్యాంక్ కు ఉన్న నిచ్చెన దెబ్బతిని పడిపోయినది. నాలుగు సంవత్సరాలుగా శుభ్ర పరచక పోవడం వలన పక్షుల వ్యర్ధాలు, మృత పక్షులు ఆ ట్యాంక్ లో పడి ఉండటం వలన ఆ ట్యాంక్ లోని నీరు కలుషితమైనది మరియు దుర్గంధ భరితముగా త్రాగుటకు పనికి రాకుండా, అంటు రోగాలు వ్యాప్తికి నెలవుగా ఉన్నవి. వాటర్ ట్యాంక్ పై పిచ్చి మొక్కలు కూడా పెరిగి ఉన్నవి. తమరు తక్షణమే స్పందించి సంబంధిత అధికారులను ఆ వాటర్ ట్యాంక్ ను శుభ్రపరచ మని అదేశించి ఆ గ్రామస్థుల ఆరోగ్యాన్ని కాపాడగలరు అని మెయిల్ లో కలెక్టర్ గారికి విన్నవించారు.









