నీటి సమస్యపై అధికారులకు వినతిపత్రం అందించిన కోడుమూరు నియోజకవర్గ జనసేన నాయకులు

కోడుమూరు

         కర్నూలు ( జనస్వరం ) :  కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలో ప్రధాన సమస్య అయినటువంటి నీటి సమస్యపై జనసేన పార్టీ తరుపున మున్సిపల్ కమిషనర్(మేనేజర్) మరియు మున్సిపల్ చైర్మన్ లను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రధాన నీటి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరామన్నారు. నీటి సమస్యను త్వరగానే పరిష్కారం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు , జనసైనికులు పాల్గొనడం జరిగింది.

See also  కదిరి దేవరపల్లి గ్రామంలో జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వ కిట్లు పంపిణీ