అంకే ఈశ్వరయ్యతో మర్యాదపూర్వక భేటీ అయిన కళ్యాణదుర్గం జనసేన నాయకులు

     కళ్యాణదుర్గం, ఏప్రిల్ 12 (జనస్వరం) : జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపి+జనసేన+బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ చౌదరిని కలిసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు గురించి చర్చించడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యక్రమాల గురించి, జనసేన పార్టీ ఇంచార్జ్ పనితీరు గురించి, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్యతో పాటు అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ చౌదరి ప్రశంసించడం జరిగింది.

See also  జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు