నారా లోకేష్ కలిసిన కళ్యాణదుర్గం జనసేన నాయకులు

కళ్యాణదుర్గం, అక్టోబర్ 8, (జనస్వరం): కళ్యాణదుర్గం జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్, సీనియర్ నాయకుడు వి.హెచ్. రాయుడు విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 7, 8 తేదీల్లో జరిగిన లోకేష్ పర్యటన సందర్భంగా జనసేన తరఫున ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ఎన్డీఏ కూటమికి పూర్తి సహకారం అందిస్తున్నామని, కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నామని తెలిపారు. కూటమి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో సమన్వయం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. నాయకుల అభిప్రాయాలను విన్న లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనల ప్రకారం కూటమి మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని భరోసా ఇచ్చారు.

See also  మున్సిపల్ కార్మికులకు మద్దతుగా జనసేన నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డి