మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

               మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ మైలవరం మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం మండల కమిటీ ఏర్పాటు గురించి మైలవరం మండలంలోని కార్యకర్తలతో మైలవరం నియోజకవర్గ ఇంచార్జి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) గారు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కల గాంధీ గారు మండల కమిటీ గురించి అలాగే గ్రామ కమిటీల గురించి చాలా బాగా మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమంలో వెల్వడం నుండి కుందేటి కళ్యాణి గారు, చంద్రల నుండి దద్దణాల చంద్ర కుమారి గారు జనసేన పార్టీ సిద్దాంతాలు, నాయకుడి మీద నమ్మకంతో జనసేనపార్టీలోకి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. వారి ఇరువురిని అక్కల రామ్మోహన్(గాంధీ) గారు పార్టీ కండూవాలను కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు మరియు వీరమహిళలు, మండల నాయకులు ఉదయ్ బ్రహ్మo, మురళికృష్ణ, రాయుడు, రమేష్, శశికళ జయరాజు, చిరంజీవి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

See also  ఆముదాలవలస నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు