టెక్కలి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కు మద్దతు తెలిపిన జనసేన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్

టెక్కలి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కు మద్దతు తెలిపిన జనసేన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్

              రెవెన్యూ డివిజినల్ కేంద్రం టెక్కలి లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల న్యాయబద్ద మైన దీక్షకు టెక్కలి జనసేన ఇంచార్జి కణితి కిరణ్ జనసేన పార్టీ తరుపున తమ సంఘీభావం తెలియ జేశారు. టెక్కలి పంచాయతి పరిధిలో గల నలభై మంది పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలల బకాయిజీతాలు, సస్పెండ్ అయిన పారిశుద్ధ్య కార్మికుడు నాగవంశపు రఘు పై వెంటనే సస్పెన్షన్ ఎత్తి వేసి తనను వెంటనే విధులలోకి తీసుకోవాలని కణితి కిరణ్ డిమాండ్ చేశారు. అలానే పంచాయతి పరిధిలో గల ఏడుగురు పంపు ఆపరేటర్లకు గత ఏడు నెలలుగా జీతాలు అందలేదని వారు తెలియజేసారు. పంచాయతి పరిధిలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు, సేనటరీ మేస్త్రి లు, ట్యాంక్ వాచర్ లు, పార్క్ వాచర్ లకు కూడా గత నాలుగు నెలలుగా జీతాలు అండడంలేదని వారు కణితి కిరణ్ దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే స్పందించిన కిరణ్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి త్వరలోనే ప్రభుత్వం వారి బకాయిలు చెల్లించేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్కలి జనసేన నాయకులు శేఖర్, హరి, శ్యామ్, సాయి మహంతి పాల్గొన్నారు.

See also  రాజంపేటలో జనసేన ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ దేవరాయల జయంతి వేడుకలు