
పెనగలూరులో శ్రీ వేణుగోపాలస్వామి తెప్పోత్సవములో జనసేన సేవా కార్యక్రమాలు
రైల్వే కోడూరు నియోజక వర్గంలోని, పెనగలూరు శ్రీ వేణుగోపాల తెప్పోత్సవంలో భక్తులకు జనసేన తరుపున ప్రసాదము అందించడము జరిగింది. ఎన్నో ఏళ్ల తరువాత చెరువు నిండి జలకళ రావవడంతో తరతరాలుగా ఆనవాయితీగా చెరువు నిండి అలుగు పారితే తెప్పోత్సనం చేయడం ఆనవాయితీ. ఈ రోజు వేల సంఖ్యలో మండలములో వివిధ గ్రామాల నుంచి దాదాపు 5000 మంది భక్తులు పాల్గని స్వామి వారి నామ స్మరణలో తరించారు. ఈ సందర్భంగా జనసేన రాజంపేట వారు మరియు పెనగలూరు జనసేన కార్యకర్తలు భక్తులకు పులిహోర ప్రసాదము 2500 మంది భక్తులకు అందించారు. కార్యక్రమములో బండ్ల కాజేస్, ఉద్దండం వెంకటేష్, సబ్రమణ్యం, శ్రీను మరియ పెనగలూరు జనసేన కారయకర్తలు రాజేష్, వెంకట్ గ్రామ పెద్దలు విరివిగా పాల్గొని విజయవంతము చేశారు. జనసేన ను ప్రజల్లోకి తీసుకు వెశ్ళడమే ప్రతిజనసైనికుడి ఆశయము కావాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థించారు.









