జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి

జనసేన పార్టీ

        ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం నాగలుబ్బల గ్రామానికి చెందినటువంటి జనసేన పార్టీ కార్యకర్త సాకే రాజు (60) కరోనా సమయంలో గుండె పోటుతో చనిపోవడం జరిగింది. అయితే కరోనా సమయంలో హాజరు కాలేని పరిస్థితి వలన, ఇప్పుడు వీలు చూసుకొని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరియు PAC సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు మరియు ముదిగుబ్బ మండలం, నాగలుబ్బల గ్రామానికి చెందినటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి మృతి చెందిన సాకే రాజు భార్య సాకే లక్ష్మీనారాయణ, మరియు కొడుకు సాకే హరి, వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మేము, జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటామని వారికి మనో ధైర్యం చెప్పి, ఆర్థిక సహాయంగా రూ 10 వేల రూపాయలనుఅందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండలానికి చెందినటువంటి జనసేన పార్టీ కన్వీనర్ గుర్రం జయ చంద్ర, కొడవండ్ల పల్లి నరేంద్ర, ముక్తాపురం గోపీనాయక్, రామాంజనేయులు, రాజశేఖర్, కోన శేఖర్, అలాగే నాగలుబ్బల గ్రామానికి చెందినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు హరికృష్ణ, మధు, హరి, రాజు, వినోద్, రాజశేఖర్ మరియు ధర్మవరం జనసేన పార్టీ నాయకులు చిలకం వెంకట రెడ్డి, అడ్డ గిరీ శ్యామ్ కుమార్, గొట్లూరు రామాంజనేయులు, నాయుడు నాయక్, మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

See also  2021 MPTC And ZPTC Janasena Candidates Win List