ఆటిజం డిజార్డర్ తో బాధపడుతున్న 6 యేళ్ళ బాలుడుకు జనసేన పార్టీ ఆర్ధిక సహాయం

    శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం నియోజకవర్గం దమ్మల వీధి 40వ వార్డులోని నివాసముంటున్న కొండా మూర్తి మరియు వనజ దంపతులు కుమారుడు కొండా సోహిత్ పుట్టినప్పటి నుంచి ఆటిజం వ్యాధితో బాధపుతున్నాడు. థెరపీ సెషన్స్ కి నెలకు 30 నించి 40 వేలు వరకు ఖర్చు అవుతుందని, బ్యానర్ లు కట్టుకుని జీవనం సాగించే తమకు చికిత్స చేయించే ఆర్థిక పరిస్థితి లేదని ఆ దంపతులు దాతలను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కామేష్, తేజ ఆస్ట్రేలియా జనసేన NRI విభాగంలో కీలకంగా పనిచేస్తున్న సనపల సంజయ్ కు పరిస్థితి వివరించగ, సొహిత్ కు 20వేలు రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించారు. శ్రీకాకుళం జనసేన నాయకులు ఉదయ్, గురుప్రసాద్ అధ్వర్యంలో సోహిత్ కు సహాయాన్ని అందించారు. తమ కుమారుడి చికిత్సకు అండగా నిలిచినందుకు మూర్తి దంపతులు జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నవీన్, ప్రదీప్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

See also  జనంకోసం జనసేన కార్యక్రమంలో ప్రజల వద్దకు జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ