జనసేనపార్టీ నంద్యాల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం

   నెల్లూరు, (జనస్వరం) : జలప్రళయంతో దెబ్బ తిని కష్టాల్లో ఉన్న ప్రజలకు జనసేనాని శ్రీ. పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు & జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కోఆర్డినేటర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (kk) గారి ఆదేశానుసారం ఈ రోజు నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం, గంగపట్నం గ్రామములో నంద్యాల జనసేనపార్టీ ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు సరిపడే 500kg ల బియ్యం, నూనె, కందిపప్పు, కారంపొడి, ఉప్పు, సబ్బులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వై.విశ్వనాథ్ గారు & నంద్యాల జనసేన పార్టీ & జనసైనికుల సహాయ సహకారాలతో పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహన కార్యదర్శులు కొట్టే వెంకటేశ్వర్లు గారు & కేతుబోయిన సురేష్ బాబు, నెల్లూరు జిల్లా జనసేన నాయకులు జి. కిషోర్, హరి రెడ్డి, అజయ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి, సుధీర్, ప్రవీణ్ కుమార్, ప్రశాంత్, రమేష్, కేశవ్, చిన్నా జనసేన తదితరులు పాల్గొన్నారు.

See also  గుక్కెడు నీటి కష్టాలు తీరడం లేదు, భవిష్యత్తు నమ్మకాలపై ఆర్భాటాలు ఎందుకు : గానిగ బాషా