
జనసేన పార్టీ, మెగా బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో మంజుల అనే దివ్యంగురాలి కంటి ఆపరేషన్ కోసం రూ.10,000 జనసైనికుల ఆర్థిక సాయం
జనసేన పార్టీ, మెగా బ్రదర్స్ సేవా సమితి, చిరంజీవి యువత ఆధ్వర్యంలో గురువారం సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని అశోకనగర్ కు చెందిన అడపాల మంజుల అనే దివ్యంగురాలి కంటి ఆపరేషన్ కోసం జనసేన నాయకులు 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందచేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసైనికులు, మెగాభిమానులు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ఎల్లప్పుడు ముందు ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మెగాభిమానులు, జనసైనికులు ధన, కోటి, మనోజ్ పాల్గొన్నారు.









