అనంతపురం జిల్లాలోని వడియంపేటలో ఉన్న HP గ్యాస్ ప్లాంట్ నందు పనిచేస్తున్న కార్మికుల సమస్యలకై ఉద్యమించిన జనసేన పార్టీ నాయకులు

   అనంతపురం, (జనస్వరం)  : అధికార పార్టీ నేతలు చివరికి గ్యాస్‌ కార్మికుల ను కూడా వదలడం లేదు. వారికి వచ్చే కూలీలు కూడా కమీషన్‌లు తీసుకోవడం సిగ్గు చేటు అని జనసేన నేతలు మండిపడ్డారు. గ్యాస్‌ కార్మికులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్‌ దృష్టికి తీసుకొచ్చారు. వరుణ్‌ ఆదేశాల మేరకు శనివారం స్థానిక వడియంపేట వద్ద ఉన్న హెచ్‌.పీ గ్యాస్‌ ప్లాంట్‌ వద్ద జనసేన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి జనసేన నాయకులు, ప్లాంట్‌ ప్రతినిధులు, కార్మికులతో చర్చించారు. కార్మికులకు వచ్చే కూలీ డబ్బులను వారి అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల కూలీల డబ్బులు నుంచి కమిషన్‌ అడిగితే జనసేన ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్‌, కుమ్మర నాగేంద్ర, కార్యదర్శి సంజీవ రాయుడు, సంయుక్త కార్యదర్శి విజయ్‌కుమార్‌, ముపూరి కృష్ణ ఆకుల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

See also  కాపులకు రాజ్యాధికారం జనసేనపార్టీ - పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం : చేగొండి హరి రామ జోగయ్య శాస్త్రి