పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ మాసోత్సవాల సందర్భంగా జనసేనపార్టీ కువైట్ ఆధ్వర్యంలో 16వ రోజు కార్యక్రమం

పవన్ కళ్యాణ్

                         జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మాసోత్సవాల్లో భాగంగా 15 వ రోజు కార్యక్రమం రాజోలు నియోజకవర్గంలో జరిగింది. రాజోలు జనసైనికుడు మండెల బాబీనాయుడు గారి ఆధ్వర్యంలో పెరాలసిస్ తో బాధపడుతున్న బోటస్ కురు గ్రామానికి చెందిన ఆదిమూలపు రాంబాబు అనే జనసైనికుడికి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ నిరంతరం జనసేన పార్టీ కోసం శ్రమిస్తున్న కువైట్ జనసేన నాయకులకు అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి రాజోలు నియోజకవర్గ జనసైనికులు మండెల బాబి నాయుడు, కమిశెట్టి రాజేష్, బల్ల సురేష్, అడబాల మురళి, చింతలపూడి తేజ, దంగేటి కరుణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

See also  కేతనకొండ గ్రామంలో ఇంటింటికి జనసేన ప్రచారం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి