విశ్వబ్రాహ్మణులకు జనసేనపార్టీ అండగా ఉంటుంది : జనసేనపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

   రాజోలు, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటిస్తున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి విశ్వబ్రాహ్మణుల తరఫున రాజోలు జనసేన పార్టీ ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి చినబాబు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదిగా చేతి వృత్తులపై ఆధారపడిన విశ్వబ్రాహ్మణులు కార్పొరేట్ వ్యవస్థల రాకతో జీవనోపాధి కోల్పోయారని వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా చేదోడు పథకంలో అవకాశం కల్పించాలని కోరడంతో పాటు విశ్వబ్రాహ్మణుల సమస్యలన్నిటినీ కూడా మనోహర్ గారికి వివరించి చెప్పారు. న్యాయబద్ధమైన విశ్వబ్రాహ్మణుల సమస్యలను అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేకూరేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని మనోహర్ గారు హామీ ఇచ్చారు.

See also  కొత్తవలసలో జనసేన జెండావిష్కరణ మార్పుకు నాంది