కొల్లివలస రోడ్ల దుస్థితిపై జనసేన ఎంపీటీసీ మరియు నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు

కొల్లివలస

         శ్రీకాకుళం ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం,సంత కొల్లివలస జంక్షన్ లో రోడ్లు దుస్థితిపై  జనసేన పార్టీ నాయకులు సంతోష్ నాయుడు, సంగం నాయుడు, గడే. కిషోర్ మరియు అంపిలి.విక్రమ్(ఎంపీటీసీ) స్పందన కార్యక్రమంకు  వెళ్లి నేరుగా కలెక్టర్ గారికి సమస్య చెప్పడం జరిగింది. గుంతలు వలన చాలా మంది ప్రజలు పడిపోతున్నారని కలెక్టర్ వద్ద వ్యక్తం చేశారు. దీనిపై ఆర్ అండ్ బి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అధికారులు సత్వరమే పరిష్కారం చూపుతామన్నారు. 

See also  వారాహి రాకకు జేజేలు : ఏపీ శివయ్య