పార్వతిపురం జిల్లా సాధనకు జనసేన అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

జిల్లా సాధనకు జనసేన అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు.

పార్వతీపురాన్ని జిల్లాగా ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం అవుతామని పార్వతీపురం జనసేన నాయకులు అన్నారు. పట్టణంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నీ అర్హతలు ఉన్న పార్వతీపురాన్ని జిల్లాగా చేసేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకోవాలని, లేని యెడల ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం అవుతామని అన్నారు. పార్లమెంట్ ప్రాతిపాదికన జిల్లాలను విభజిస్తున్నప్పటికి, పార్వతీపురం విషయంలో మినహాయింపుతో పార్వతీపురాన్ని అదనపు జిల్లాగా ప్రకటించాలని కోరారు. పార్వతీపురం జిల్లా కావడం అనేది రెండు తరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం అని, జిల్లాగా ప్రకటించని సమయంలో ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోంగాడ గౌరి శంకర్, రెడ్డి కరుణ, చందక, అనిల్, నెయ్యి గాపుల సురేష్, రాజాన, రాంబాబు, బమిడిపాటు చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

See also  రాజారెడ్డిపై వైసీపీ గుండాలు చేసిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ