నరవ గ్రామంలో కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందించిన జనసేన నాయకులు

                   విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామం లో కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని జనసేన పార్టీ పెందుర్తి నియోజకవర్గం తరఫున GVMC కమిషనర్ డాక్టర్ సృజన గారికి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి వినత రూపంలో తెలియజేయడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉన్న కల్యాణ మంటపాన్ని ప్రజా తీర్పు కు వ్యతిరేకంగా సంవత్సర కాలం క్రితం సచివాలయం గా మార్చడం జరిగింది. ఆనాడు పెద్దల సమక్షంలో GVMC అధికారులను, పాలక ప్రభుత్వంను ప్రశ్నించగా 6 నెలల కాల వ్యవధిలో సచివాలయాన్ని వేరే ప్రదేశానికి మార్చి ప్రజలకు అందుబాటులోకి కళ్యాణ మండపం తీసుకు వస్తామని చెప్పడం జరిగింది. 6నెలలు కాదు 1 సంవత్సర కాలం గడిచిన ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు మరియు ఈ మధ్యకాలంలో సచివాలయం సిబ్బందికి, జోనల్ కమిషనర్ గారికి, ఆన్లైన్లో స్పందన కంప్లైంట్ ఇచ్చిన ప్రభుత్వం నుంచి ప్రజలకు అనుకూలంగా స్పందన రావడం లేదు అని తెలియజేయడం జరిగింది.  ఈ యొక్క కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధన శ్రీకాంత్, మండల నాయకులు తనకాల శ్రీనివాస్ మోటురు చైతన్య పాల్గొన్నారు.

See also  సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ ఫోబియో పట్టుకుంది

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి