తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహనరావు

  శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా రైతు సంఘాలు, అఖిలపక్షం తరుపున రైతుల తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి మరియు దళారుల దోపిడీని అరికట్టి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ గారిని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆమదాలవలస ఇంఛార్జ్ శ్రీ పేడాడ రామ్మోహనరావు, రైతు సంఘాల జిల్లా నాయకులు బుడితి అప్పలనాయుడు, రాజు, నీలం రాజు, భాస్కరరావు, దుర్గారావు, దనుంజయ రావు తదితరులు పాల్గొన్నారు.

See also  ఎమ్మెల్యే ప్రోద్బలంతో అక్రమకేసు పెట్టి మానసికంగా హింసిస్తున్నారని వినుతా కోట ఆవేదన