జనసేనపార్టీ బాగు కోసం సైకిల్ యాత్ర చేసిన దుర్గాప్రసాద్ ను సత్కరించిన జనసేన నాయకులు

జనసేన

   శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం దల్లవలస గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే జనసైనికుడు 2024లో జనసేనపార్టీ అధికారంలోకి రావాలని, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని సైకిల్ యాత్ర ప్రారంభించి అమరావతి చేరుకున్నారు. అనంతరం మంగళగిరి విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో అధినేత గారి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించిన సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గ కార్యాలయంలో ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు గారు అభినందనలు తెలిపి సన్మానం చేశారు. తదనంతరం ఉత్తమ జన సైనిక్ అవార్డు ను బహుకరించారు.

See also  గ్రామీణ ప్రాంతాల రహదారులకు మరమ్మతులను చేపట్టాలి : రాహుల్ సాగర్