జవాన్ మరుప్రోలు జస్వంత్ కు ఘన నివాళులు అర్పించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు

జవాన్

             గురువారం జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మారుప్రోలు జస్వంత్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన దేశ  సైనికుడు మారుప్రోలు జస్వంత్ రెడ్డి జిల్లాలోని బాపట్ల మండలంలోని దరివాడ కొఠపాలెం గ్రామానికి చెందినవాడు. రాజౌరి జిల్లాలోని సుందర్‌బానీ సెక్టార్‌లో జరిగిన తిరుగుబాటు ఆపరేషన్ సందర్భంగా ఈ సంఘటనలో అమరులైనారు. ఈ  సందర్భంగా  విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నాయకుడు ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు అతిథిగా పాల్గొని మరణించిన సైనికుడికి నివాళులు అర్పించారు. సైనికుడి వీరమరణం పట్ల మౌనం పాటించి, తర్వాత వారి ప్రాణత్యాగం గురించి కొనియాడారు. ఉగ్రమూకలను ఎదురొడ్డి అశువులు బాసిన మారుప్రోలు జస్వంత్ రెడ్డి అమరహే అంటూ నినాదాలు చేస్తూ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీకాంత్, తదితర జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు. 

See also  పెద్దపాలెం గ్రామంలో జనసేన పార్టీలోకి చేరికలు, జెండా ఆవిష్కరణ