జనసేన పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన చీమకుర్తి మండల జనసేన నాయకులు

    చీమకుర్తి, (జనస్వరం) : ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో స్థానిక దీన్నేపురంలోని తోట సుధాకర్ గారి ఇంటి వద్ద చీమకుర్తి మండల జనసేన పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ జనసేన నాయకులు, కార్యకర్తలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు పల్లపు శివప్రసాద్ మాట్లాడుతూ 3వ వేవ్ తో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న సందర్భంలో రాబోయే రోజుల్లో మరింత కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని రానున్న రోజుల్లో లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని. లాక్ డౌన్ కనుక పెడితే నిరుపేదలు ఇబ్బంది పడతారు వారికి మన జనసేన పార్టీ నుంచి అండగా నిలబడాలని తెలిపారు. జనసేన పార్టీ బలోపేతానికి జనసైనికులు అందరూ కృషి చేయాలని అన్నారు. రానున్న 2024 ఎలక్షన్ లో అధికారం మనదే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి మండలం జనసేన పార్టీ నాయకులు ముత్యాల సురేష్, యాదాల కోటి, దరిమడుగు నాగరాజు, బండి ప్రసాద్, తోట సుధాకర్, తాతినేని రాము, కణాల మారుతి, ముప్పరాజు వెంకన్న, చల్లా వెంకట్రావు, చల్లా సురేష్, విన్నకోట కృష్ణ, షేక్ బాబు, పొన్నపల్లి శ్రీహరి, దాసరి కొండలు, శ్రీనాథ్, వేమన నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

See also  ఆమదాలవలస నియోజవర్గంలో జనంతో - జనసేన కార్యక్రమం ప్రారంభం