పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తణుకు నియోజకవర్గ జనసేన నాయకులు

   తణుకు, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతుల యొక్క స్థితిగతుల గురించి ఆలోచించి రైతులకు ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్లని ఆదుకునెందుకు నిమిత్తం ఐదు కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు కృతజ్ఞతగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్  విడివాడ రామచంద్రరావు, తణుకు టౌన్ పార్టీ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీను, తణుకు మండలం పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశీ, అత్తిలి మండలం పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్, రేలంగి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి వెంకట సత్యనారాయణ, లీగల్ సెల్ మెంబర్ వెంకన్నబాబు, గ్రామ పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

See also  కడప జిల్లాలో జనసేనపార్టీ కౌలు రైతు భరోసా యాత్రను విజయవంతం చేయండి