జనసైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన నాయకులు

     కళ్యాణదుర్గం, (జనస్వరం) : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం కదిరి దేవర పల్లి గ్రామం జన సైనికుడు నవీన్ వాళ్ల తండ్రి గారు పావగడ తాలూకా బుడ్డా రెడ్డి పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామ్మూర్తి మరణించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి రామ్మూర్తి గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున రామ్మూర్తి గారి భార్యకు 10,000 వేల రూపాయలు ఆర్థిక సహకారం ఇవ్వడం జరిగింది. అలాగే కుటుంబానికి ఎల్లప్పుడు అండగా జనసేన ఉంటుంది అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంబదూరు మండలం అధ్యక్షులు చంద్రమౌళి, జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కదిరిదేవరపల్లి వెంకటేష్, కార్తీక్ కురుబ, హరిప్రసాద్, నరసింహమూర్తి, తిమ్మాపురం నరేష్, శ్రీనివాసులు, భరత్, నరసింహ మూర్తి, గంగరాజు, మణి కుమార్, రమేష్, గోవిందరాజులు, గొల్ల నాగభూషణ, సురేష్, మణికంఠ, శ్రీనాథ్, సాయితేజ జూల, ఈరన్న, నయన్ తేజ, రాంప్రసాద్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.

See also  వైసీపీ, టీడీపీ పార్టీల నుండి జనసేనపార్టీలోకి భారీ చేరికలు