విశాఖలో స్థానిక సమస్యలపై, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై జనసేన నాయకుల సమావేశం

విశాఖలో స్థానిక సమస్యలపై, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై జనసేన నాయకుల సమావేశం

       విశాఖ 88 వార్డ్ పెందుర్తి, గాజువాక నియోజకవర్గం దువ్వాడ జనసేన పార్టీ ఆఫీసు నందు క్రియాశీల సభ్యులతో వార్డ్లో గల సమస్యలపై, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా వార్డులో యాదవ్ జగ్గరాజు పేట, దువ్వాడ గ్రామాల్లో సుమారు 40 సంవత్సరాల క్రితం APICC భూములు తీసుకొని రైతులకు తగు న్యాయం చేయలేదని, కనీసం యువతికి ఉద్యోగాలు కూడా కల్పించడం లేదని వాటిపై పార్టీ పరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి,  చిరు వ్యాపారాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్న సామాన్యులకు GVMC అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పార్టీ దృష్టికి జనసైనికులు తీసుకోవడం జరిగింది. వార్డులో ప్రజలు డ్రైనేజీలు లేక, ఉన్న డ్రైనేజి శుభ్రం చేయలేకపోవడం, వీధిలైట్లు, సచివాలయ సిబ్బంది ప్రజలకు సరిగ్గా సేవలు అందించకపోవడం, మరణ జనన ధ్రువపత్రాలు తీసుకోవడంలో ప్రజలు ఇబ్బంది పడటం వంటి సమస్యలను పార్టీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అభ్యర్థి వబ్బిన జనార్ధన శ్రీకాంత్, కర్రీ హనుమంతరావు, సిరసపల్లిఅప్పారావు, అశోక్, చలం, గండ్రిడ్డి అశోక్, ఈ గంగవరం రాజు, గోపి, ప్రసాద్, వెంకటేష్ , తేజ, మురళి, సురేష్, రవి, మరియు జనసైనికులు పాల్గొన్నారు.

See also  జనంలోకి జనసేన సమన్మయ కమిటీ టీమ్ పిఠాపురం