ప్రజల నీటి కొరత తీరుస్తున్న జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

గర్భాన సత్తిబాబు

      పాలకొండ ( జనస్వరం ) :  రెండు రోజుల నుంచి వర్షాల కారణంగా కరెంటు లేకపోవడంతో ప్రజలు పలు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అందులో ముఖ్యంగా త్రాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన సత్తిబాబు వారి కష్టాలను చూసి చలించారు. చిన్న మంగళాపురం గ్రామంలో ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే వాటర్ ట్యాంక్ తెప్పించి నీటి కొరత నుండి ఉపశమనం కల్పించారు. ఈ కార్యక్రమం డొంక.శివ ప్రసాద్, బలగ.విరపునాయుడు, యేన్ని, గౌరినాయుడు, విజయ్ కుమార్, గణేష్, ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు. 

See also  పాలన చేతకాక ప్రజలపై పన్నుల భారమా ! అనంతపురం నగర అధ్యక్షులు పొదలి బాబురావు