పాలకొండ నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు గర్బాన సత్తిబాబు

    పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం కుశిమి, శంబం, మల్లి, ఇసకగెడ్డ, దారిమల్లి గ్రామాల్లో జనసేన నాయకులు గర్బాన సత్తిబాబు పర్యటించారు. గ్రామ స్థానికులతో సత్తిబాబు మాట్లాడుతూ జనసేనపార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా జనసైనికులు పనిచేయాలని తెలియజేసారు. అలాగే గ్రామంలో ఉండే త్రాగునీటి బావిని పరిశీలించి, బావి మరమత్తుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

See also  జనసేన పార్టీ పి.ఎ.సి. సభ్యునిగా శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారు