జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శానిటేషన్ కార్మికులకు దుప్పట్లు పంపిణీ

   ఉండవల్లి, (జనస్వరం) : ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండి తెల్లవారుజామున పనిచేసుకునే శానిటేషన్ కార్మికులు చలితో వణికిపోతూ ఇబ్బంది పడటం జనసేన నాయకులు గమనించి శానిటేషన్ కార్మికులను చలి నుండి కాపాడటం కోసం తమవంతు కర్తవ్యంగా భావించి గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతమైన ఉండవల్లి గ్రామంలో కార్మికులకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుకూలంగా జనసేన నాయకత్వం ఉండవల్లిలో పారిశుధ్య కార్మికులకు క్రిస్టమస్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని దుప్పట్లు పంపిణీ చేయడం చాలా అభినందించే విషయమని, వారికి జనసేన పార్టీ తరుపున కృతజ్ఞతలు చెపుతూ రాబోయే రోజుల్లో అందరికి జనసేన పార్టీ అండగా ఉండి, ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ మరియు జనసేన చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, తాడేపల్లి మండలం అధ్యక్షులు దాసరి శివ నాగేంద్రం, తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు సామల నాగేశ్వరరావు, ఉండవల్లి గ్రామం నాయకులు కోటేష్ బాబు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ గారిని కులాల పేరుతో దూషిస్తే ఖబడ్దార్ : జనసేన నాయకులు మైలేరి మల్లయ్య