
జనసేన నాయకులు టి.శివశంకర రావు ఆధ్వర్యంలో విశాఖలో 38J బస్సు సేవల కోసం పోరాడి సాధించిన జనసైనికులు
ఇండస్ట్రియల్ బెల్ట్ కొండ ప్రాంతాలలో (జనతాకాలనీ, ఎ.ఎస్.ఆర్ కాలనీ, అంబేద్కర్ కాలనీ, ఇంద్రనగర్ 1 2, జవహర్నగర్, Ex-servicemen కాలనీ, కోరమండల్) నివసిస్తున్న కార్మికులు, విద్యార్థులు మరియు సీనియర్ సిటిజన్లకు 38 J తిరగవలసిన రూట్ లో తిరగకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్ గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ గారు, 60 వార్డ్ అభ్యర్థి చంద్రమౌళి మరియు టీంJCF, టీం ధర్మశాల, ఇంద్రజిత్, అప్పారావు, సత్తి బాబు మరియు జనసైనికులు జనసేన పార్టీ తరుపున 38 J బస్సు సేవలను రెగ్యులర్ మార్గంలో తిరిగి ప్రారంభించాలని 16-10-2020 ఇచ్చిన లేఖకు సంబంధించి, అధికారులు చెప్పిన కారణం అదనపు చెట్ల కొమ్మలు అని, ఆ రూట్లో మేము వెళ్లి చూసి అర్థం చేసుకున్నాము. అందువల్ల మేము జివిఎంసి, APSEB, మరియు హార్టికల్చర్ విభాగానికి ఫిర్యాదు చేసి మరియు సమస్య పరిష్కారం కోసం త్వరగా చర్యలు తీసుకోవాలని హార్టికల్చర్ విభాగానికి మేము అభ్యర్థించాము. తద్వారా గత 4 రోజులుగా అధికంగా పెరిగిన చెట్ల కొమ్మలను జనసైనికులు మరియు నాయకులు దగ్గర వుండి కత్తిరించేలా చేసి, ఈ సమస్య పరిష్కరించాము. అందువల్ల 38 J బస్సు సేవలను సాధారణ మార్గంలో మళ్లీ తిరిగి ప్రారంభించమని మేము డిపో మేనేజర్ జనసేన పార్టీ తరపున వినతి ఇవ్వడం జరిగింది. డిపో మేనేజర్ మాధవ గారు రేపటి నుంచి బస్ మరలా రెగ్యులర్ రూట్లో తాగడానికి వారి సిబ్బందికి ఉత్తర్వులు జారీచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జన సైనికులకు మరియు APSRTC డిపో మేనేజర్, జివిఎంసి, APSEB, మరియు హార్టికల్చర్ విభాగానికి మా జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని అన్నారు.









