జనసేన నాయకులు సాయిబాబా గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరిన టిడిపి, వైసీపీ కార్యకర్తలు

సాయిబాబా

    అరకువేలి, (జనస్వరం) : అరకు నియోజకవర్గం అరకు వేలి మండలం సుంకరమెట్ట పంచాయితీ పరిధిలోగల పిరిబంధ గ్రామంలో జనసేన పార్టీ  నాయకులు  సాయిబాబా, దూరియా, రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించి, గ్రామస్తులతో సమావేశమై గ్రామంలో ఉన్న సమస్యల మీద చర్చించారు. అనంతరం సాయి బాబా, రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి జనసేన పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలని వారితో సూచించారు. అనంతరం టిడిపి, వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. సాయిబాబా వారికి కండువాలు వేసి పార్టీలో ఆహ్వానించారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురిఅయ్యి మంచానపడి ఉన్న బాధితులకు, మరియు దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడుతున్న ఓ గిరిజనుడకు భరోసానిస్తూ వారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జానీ, బాబురావు, గ్రామ ప్రజలు తదితురులు పాల్గొన్నారు.

See also  వరల్డ్ పవనిజం డే సందర్భంగా పేదలకు అన్నదానం చేసిన జనసైనికులు