తిరుపతిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నాకు అండగా జనసేన నాయకులు, వీర మహిళలు

తిరుపతి

        తిరుపతి ప్రభుత్వ రూయా ఆసుపత్రి నందు పనిచేస్తున్న దాదాపు 120 మంది పారిశుద్ధ్య కార్మికులను చెప్పాపెట్టకుండా, ఉన్నపళంగా విధుల నుంచి తొలగించారు. దాదాపు తొమ్మిది నెలలుగా కార్మికులకు జీతభత్యాలు చెల్లించకుండా పని చేయించుకొని, ఇవాళ మీ కాంట్రాక్టు ముగిసిందని విధులు నుండి తీసివేయడంతో ఆందోళనకు గురైన కార్మికులు ఆస్పత్రి ఆవరణలో ధర్నా చేపట్టారు. కార్మికుల ధర్నాకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి రాజేష్‌ యాదవ్‌, సుభాషిని గార్లు పాల్గొన్నారు. 

See also  దళిత హక్కుల పోరాటసమితి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు