
వి.ఎస్.ఎం కాలేజి నారాయణమూర్తి గారు మృతి పట్ల సంతాపం తెలియజేసిన జనసేన నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్
1966 లో మనకి విద్యకి కాలేజీలు లేని సమయంలో పెద్దలందరినీ కన్సల్ట్ చేసి ఇక్కడ విద్యాసంస్థలు ఉండాలని, విద్యార్థులు అందరూ ఉన్నత విద్య ను అభ్యసించాలని వి.ఎస్.ఎం కాలేజి ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం తో వుండవిల్లి సత్యనారాయణ మూర్తి గారు రామచంద్రపురం పట్టణము లో V. S. M కాలేజీ ని స్థాపించడం జరిగింది. వీరి తండ్రి గారు రామయ్య గారు బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో తనదైన పాత్రను పోషించడం జరిగింది. అలాంటి మహనీయుల కుటుంబంలో పుట్టిన రాయవరం మున్సబ్ వుండవిల్లి సత్యనారాయణ మూర్తి గారి దత్తపుత్రుడు, రామచంద్ర పురం VSM కళాశాల అధ్యక్షులుగా దశాబ్దకాలంపాటు పని చేసిన మెర్ల నారాయణమూర్తి(73) గారు కాకినాడలో ఇనోదయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం స్వర్గస్తులైనారు. వి.ఎస్.ఎం కాలేజి నారాయణమూర్తి గారి కుటుంబ సభ్యులకు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు సంతాపం తెలియజేయడం జరిగింది.









