జనసేన నాయకులు నాగబాబు గారి పుట్టిన రోజు సందర్భంగా త్యాడ రామకృష్ణ రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

జనసేన నాయకులు నాగబాబు గారి పుట్టిన రోజు సందర్భంగా త్యాడ రామకృష్ణ రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

                    జనసేన పొలిటికల్ ఎఫ్ఫైర్స్ కమిటీ సభ్యులు,శ్రీ కొణిదెల నాగేంద్ర బాబు గారి పుట్టినరోజు సందర్భంగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయనగరం పట్టణ నిరాశ్రయుల వసతి గృహంనందు గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకురాలు, జనసేన రాష్ట్ర పొలిటికల్ ఎఫ్ఫైర్స్ కమిటీ సభ్యురాలు శ్రీమతి పాలవలస యశస్వి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా యశస్వి గారి మాట్లాడుతూ చిరంజీవి గారి అభిమానులనగానే ఠక్కున గుర్తుచ్చేది రక్తదానం, నేత్రదానం అని, అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ఆశయాలతో ఎన్నోరకాల సేవాకార్యక్రమాలతో ముందుకెళ్తూ జిల్లా చిరంజీవి యువత ఆదర్శంగా ఉన్నారనడంలో అతిశయోక్తి కాదని అన్నారు. చిరంజీవి పేరుతో కాకుండా నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్ స్వశక్తితో కష్టపడి సినీరంగంలో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్నారని, ఇటువంటి త్రిమూర్తులు లాంటి మెగాఫ్యామిలీని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయబాటలో మెగాఫ్యామిలీ అభిమానులు పయనించడం అభినందనీయమని అభిమానులసేవలను గూర్చి ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత ముఖ్యనాయకులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, ఝాన్సీ వీరమహిళ గాయత్రి గారు, జిల్లా చిరంజీవి యువత సభ్యులు, జనసైనికులు లోపింటి కళ్యాణ్, దాసరి యోగేష్, పళ్లెం కుమారస్వామి, ఎర్నాగుల చక్రవర్తి, రౌతు సతీష్ గారు, కిలారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

See also  నెల్లూరులో MyFirstVoteForJanaSena కార్యక్రమంలో

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి