జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 18 వ రోజు సేవాదానం

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 18 వ రోజు సేవాదానం

         జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ సభ్యులు శ్రీ కోలా మురళి గారి ఆధ్వర్యంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కో-ఆర్డినేటర్ శ్రీ పండ్రా రంజిత్ కుమార్ గారి అధ్యక్షతన ప్రొద్దుటూరు లోని మదర్ థేరిసా వృద్ధాశ్రమం లో హాట్ వాటర్ ప్లాస్క్ లు  పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు బీ.జె.పి. జనసేన కో ఆర్డినేటర్ శ్రీ మాదాసు మురళీ గారు ముఖ్య అతిధిగా పాల్గొని వృద్దులకు ప్లాస్క్ లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో వేడి నీరు తాగితే కరోనా బారిన పడకుండా కొంత మేరకు మంచిదని డాక్టర్స్ సూచన చేస్తున్నారని, దానిని దృష్టిలో పెట్టుకొని పేదలకు ఈరోజు కోలా మురళీ గారు వీటిని డోనేట్ చేయడం అభినందయం. అలాగే ఈ 35 రోజులు 35 కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన జనసేన హెల్ప్ హాండ్స్ కువైట్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ గంగారపు చంద్రశేఖర్ గారికి అధ్యక్షుడు శ్రీ కంచన శ్రీకాంత్ గారికి జిల్లా మొత్తం ఆర్గనైజింగ్ చేస్తూన్నా రంజిత్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు రాష్టృ చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరి ఎన్, రవిప్రసాద్, కమలాపురం జనసైనికుడు అతికారి నాగేంద్ర, మంచాల సంజీవ్, కళ్యాణ్ కుమార్, మహబూబ్ బాషా, వినోద్ కుమార్ , విజయ్ కళ్యాణ్, నంద మెగా శ్యామ్, మధు రాయల్, చోటు ,పంజగల రఘు తదితరులు పాల్గొన్నారు. 

See also  విద్య, వైద్యం, అభివృద్ధికి నోచుకోని పత్తికొండ