కడప జిల్లా వరద బాధితులకు అండగా జనసేన గల్ఫ్ కార్మికులు

కడప

   కడప, (జనస్వరం) : కడప జిల్లా నందలూరు మండలంలోని నల్లతిమ్మయ్య నడిగడ్డ ప్రజలు చేయ్యేరు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారు. వరదల వల్ల నష్టపోయిన ఈ నడిగడ్డ ప్రజలకు జనసేన గల్ఫ్ కార్మికులు అర్థిక సాయంతో దుప్పట్లు, చీరలు, లుంగీలు, బక్కెట్లు, జగ్గులు, దొమ తెరలు జనసేన నాయకులు కొట్టే శ్రీహరి మరియు ప్రశాంత్ అధ్వర్యంలో అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన గుంటూర్ శంకర్ గారికి మరియు జనసేన గల్ఫ్ కార్మికులు సభ్యులు మునేయ్య, కృష్ణ, షపీ, దుర్గరావు, రాకేష్ నాగ, సూర్య, రేణుక, సతీష్ గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమములో జనసేన నాయకులు ఆకుల నరసయ్య, యెద్దల నరసింహా, సర్దార్ బాలు మరియు నడిగడ్డ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  నడుకూరు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు