చెత్తపై జనసేన పోరుబాట : ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు

    ఏలూరు, (జనస్వరం) : ఏలూరు నగరంలో అపరిశుభ్రత అధికంగా ఉందని, రహదారులన్నీ చెత్తాచెదారాలతో అధ్వానంగా మారాయని, దీనిపై జనసేన ప్రజల కోసం పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉందని జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. జనసేన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఏ వీధిలో చూసినా అపరిశుభ్రతే దర్శనమిస్తోందని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫొటోలను ప్రదర్శించారు. ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిసిటీకే పరిమితమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు నగర అధ్యక్షుడు కాశీ నరేష్‌, ఉపాధ్యక్షుడు బొత్స మధు, అధికార ప్రతినిధి అల్లు సాయిచరణ్‌ తేజ్‌, నగర సహాయ కార్యదర్శి ధర్మేంద్ర, మండల కోశాధికారి పైడి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

See also  సంజీవయ్య గారి స్ఫూర్తిని చాటడమే పవన్ కళ్యాణ్ గారి సంకల్పం