మదనపల్లిలో ముమ్మరంగా సాగుతున్న జనసేన ప్రచారం

    మదనపల్లి ( జనస్వరం ) :  59వ రోజు జనసేన పార్టీప్రచారంలో భాగంగా ఎస్టేట్ పరిసర ప్రాంతాలలో ప్రచారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు నా సేన నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్  దారం అనిత ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం రానుందని అన్నారు. ప్రజలందరూ ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్, కొణిదెల శంకర్ బాబు కోటకొండ చంద్రశేఖర్, కుప్పాల శంకర, అశ్వత్ రాయల్, ధరణి కుమార్ రాయల్, జనసేన సోను, గణేష్, సిద్ధు, రమేష్ సుప్రీం హర్ష, యాసీన్, నవాజ్, బహదూర్, చంద్రశేఖర్ పద్మావతి నీరు గట్టుపల్లి శేఖర్ తదితరులు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

See also  చింతామణి జనసేనపార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం