
నూజీవీడులో కరోనా ఫ్రంట్ వారియర్స్ అయిన మీడియా మిత్రులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన, బీజేపీ నాయకులు
ప్రస్తుతం ప్రపంచం మొత్తం మానవాళి కరోనా మహమ్మారి బారిన పడింది. ఎప్పటికప్పుడు నిరంతర వార్తా సమాచారాన్ని మనకు మీడియా పాత్రికేయులు అందిస్తున్నారు. ఈ కరోనా సమయంలో కూడా వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకు వార్తా ప్రపంచాన్ని అందిస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా నూజివీడు నియోజకవర్గంలో జన్మదిన వారోత్సవాలు వేడుకల్లో భాగంగా ఈరోజు ముసునూరు మండలంలోని మీడియా జర్నలిస్టు మిత్రులకు , నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున నిత్యావసర సరుకులను నూజివీడు బీజేపీ ఇంచార్జ్ నూతక్కి వేణు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఇ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు, త్రినాధ్,సత్యనారాయణ, రాజా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆముదాల ఇస్సాక్ గారు ,సీనియర్ బీజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.









