
మత్స్యకార కుటుంబాలకి నిత్యావసర సరుకులు అందించిన జనసైనికులు
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సేవా స్పూర్తితో, జగ్గయ్యపేట నియోజకవర్గంలో వత్సవాయి మండలంలో భీమవరం గ్రామంలో గల కుటుంబాలకి సంబంధించిన మత్స్యకారులకి కరోనా దృష్ట్యా జీవనం గడవడం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న విషయం తెలుసుకుని నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో జనసేన పార్టీ తరుపున బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరిగింగి. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ కరోనా దృష్ట్యా పనులు లేక చాల మంది అనేక రకాలుగా వారి జీవనం సాగించటానికి ఇబ్బంది పడుతున్నారని, మరీ భీమవరం గ్రామంలో ఉన్నటువంటి 20 మంది మత్స్యకార కుటుంబాలు పనులు లేక తినటానికి ఏమి లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి తమ వంతుగా సహాయం చేయటం జరిగిందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం తలపెట్టామని, ఎక్కడ కష్టంఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే మీ మీ పరిధిలో ఇబ్బందిలో ఉన్న కుటుంబాలకి మీ వంతుగా సహాయం అందించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మురళి కృష్ణ, కొర్రపాటి గోపీచంద్, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.








