పొలాలలో పనిచేస్తున్న కూలీలకు మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేసిన జనసైనికులు

పొలాలలో పనిచేస్తున్న కూలీలకు మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేసిన జనసైనికులు

          కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో పొలంలో పనిచేస్తున్నటువంటి కూలీలకు నియోజకవర్గ సమన్వయకర్త బాడిశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పొలంలో పనిచేస్తున్నటువంటి కూలీలకు కరోనా మహమ్మారి కారణంగా మాస్క్ లు శానిటైజెర్ లు పంపిణీ చేశారు.  అలాగే కూలీలకు కరోనా పట్ల అవగాహన కల్పించారు. పొలం పనులకు వెళ్లేటప్పుడు వాహనాలలో భౌతికదూరం పాటించాలని నిరంతరం మాస్క్ లని ధరించాలని పొలంలో పనులు చేసేటప్పుడు, కూడా భౌతికదూరం పాటిస్తూ పనులు చేసుకోవాలని తరచుగా చేతులను శుభ్రపరుచుకుంటూ ఉండాలని ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి వైరస్ మన దరికి చేరదని వివరించారు. పల్లె గ్రామాలలో ప్రజల్లో అవగాహన లేక వైరస్ సోకిన వ్యక్తిపై వివక్ష చూపుతున్నారని ఆలా కాకుండా అందరిని మన కుటుంబ సభ్యులవలె భావిస్తూ మనం పోరాడాల్సింది వ్యాధితో అని బాడిశ మురళీకృష్ణ వారికి  అవగాహన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొర్రపాటి గోపీచంద్, రామకృష్ణ నవీన్ తదితరులు పాలొన్నారు.

See also  పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు బొలి శెట్టి శ్రీకాంత్