మూడు రాజధానులపై జనసైనికుడు గునుకుల కిషోర్ స్పందన

మూడు రాజధానులపై జనసైనికుడు గునుకుల కిషోర్ స్పందన. 

                రాజధాని భూముల సేకరణ విషయంలో ఆనాడు పవన్ కళ్యాణ్  అప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మరియు నాయకులు రాబోయే రోజుల్లో ఉండరని ప్రభుత్వం మారవచ్చని రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి భూములను త్యాగం చేసిన రైతులకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని తెలియజేశారు. రాజధాని రైతుల అనుమతితో స్వచ్ఛందంగా తీసుకోవాలని పలుమార్లు స్పష్టం చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి గారు ఉత్తర రాష్ట్రాల వలె మూడున్నర వేల ఎకరాలు సరిపోవని 33 వేల ఎకరాలు కావాల్సిందేనని పట్టుపట్టారు కానీ రాజధాని ఎక్కడ ఉన్నా పర్లేదు అని చెప్పారు. ప్రజల క్షేమం గురించి ఆలోచించినట్లయితే రాజధాని అమరావతిలో వద్దని స్పష్టం చేసేవారు. ఏటా మూడు పంటలు పండే సామర్థ్యం గల పచ్చటి పొలాల్లో భవంతుల నిర్మాణం అనర్ధదాయకం అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో రోజుకి పది వేల కరోనా కేసులు నమోదు అవుతుంటే ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు.  ఈ తరుణంలో రాజధాని పై ప్రత్యేక శ్రద్ద ఆపి, ప్రజల ఆరోగ్యం పట్ల మరియు వైద్య సదుపాయాల పట్ల దృష్టి సారించాలని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. గవర్నర్ గారు రెండు బిల్లులు ఆమోదం పొందిన తరుణంలో రైతుల పరిస్థితిపై పార్టీ అధిష్టానం త్వరలోనే ప్రణాళిక చేపడుతుందని నెల్లూరు జనసైనికుడు గునుకుల కిషోర్ స్పందించారు. 

See also  మదనపల్లిలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటానికి జనసేన మద్దతు